కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా ప్రపంచ పరిణామం మారిపోయింది. మహమ్మారి విరుచుకుపడే వరకు ఒక వైరస్ ధాటికి ప్రపంచం ఎంతలా అతలాకుతలం అవుతుందన్నది పెద్దగా అవగాహన లేదు. కరోనా ఆ కొరతను తీర్చేసింది.
ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏ కొత్త వైరస్ పుట్టుకొచ్చినట్లు తెలిసినా..ప్రపంచ ప్రజలు వణుకుతున్నారు. అదెక్కడ తమ వరకు వస్తుందన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. ఈ భయాలను మరింత పెంచేలా కొందరు చేస్తున్న ప్రచారాలు మరింత టెన్షన్ ను పుట్టిస్తున్నాయి.
ఇప్పటివరకు పక్షుల్లోనే కనిపించే బర్డ్ ఫ్లూ.. తొలిసారి ఒక మనిషిలో గుర్తించారు. ఈ ఉదంతం రష్యాలో చోటు చేసుకుంది. ప్రపంచంలో తొలిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసును గుర్తించామని.. ఇన్ ఫ్లూయోంజా ఎ వైరస్ లోని H5N8 స్ట్రెయిన్ను వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు మానవుల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా వెక్టార్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నాయి.
పక్షుల్లో చాలా ప్రమాదకరమైన ఈ వ్యాధి ఇప్పటివరకు మనుషుల్లోకి పాకినట్లుగా ఎక్కడా నమోదుకాలేదు. కరోనా దెబ్బకు కకావికలమైన ప్రపంచానికి బర్డ్ ప్లూ సైతం మనుషఉల్లోకి వచ్చేసిన వైనం కలవరాన్ని పెంచుతుందనటంలో సందేహం లేదు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబరులో బర్డ్ ఫ్లూ వెలుగు చేసింది. ఓ ఫౌల్ట్రీ ఫామ్ లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు.
ప్రస్తుతానికి వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ ఏ రూపులోకి తీసుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. రానున్న రోజులు మరింత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని ఈ ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.